- వైసిపి నేతలపై అచ్చెన్నాయుడు ఆరోపణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులే రాబందుల్లా ప్రజలను పీక్కుతింటున్నారని అధికార పార్టీ నేతలనుద్దేశించి టిడిపి రాష్ట్రఅధ్యక్షులు కె అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యేలు భూములను గద్దల్లా ఎగరేసుకుపోతున్నారని విమర్శించారు. భూ వివాద పరిష్కారానికి నరసరావుపేటకు చెందిన కుటుంబం స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిశారని తెలిపారు. ఎమ్మెల్యే వారి నుంచి రూ.16 లక్షలు అడగటం దారుణమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక ఆ కుంటుంబం ఆత్మహత్యకు యత్నించడం తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. గోపిరెడ్డిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా నాగార్జున సాగర్ సాక్షిగా జగన్ నీటి నాటకం ఆడారాని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్రకుమార్ విమర్శించారు. హఠాత్తుగా రైతుల కోసమే దండయాత్ర చేశానని చెప్పడం ప్రజల్ని మోసగించడమేనని విమర్శించారు. సమసిపోయిన ప్రాంతీయ విద్వేషాలను తిరిగి రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకోవడం రాజకీయ దుర్భుద్ధిలో భాగమనేనని ఆరోపించారు.