ఉపాధి కూలీ గుండెపోటుతో మృతి

Feb 17,2024 16:23 #Kakinada

ప్రజాశక్తి-కోటనందూరు(కాకినాడ) : భీమవరపు కోట గ్రామానికి చెందిన పురే అప్పారావు(65) శనివారం గుండెపోటుతో మృతి చెందినట్లు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తెలిపారు. ఉదయాన్నే ఉపాధి పని చేయడానికి వెళ్లి.. పని చేస్తుండగా ఒక్కసారిగా పడిపోయాడు. స్థానిక ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తోటి కూలీలు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అనంతరం ఉన్నత వైద్యం కోసం తుని ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. గుండెపోటు రావడంతోనే అప్పారావు మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు. మతదేహాన్ని స్థానిక సర్పంచ్‌ జగడాల వీరబాబు ,ఎంపిటిసి సభ్యులు కొత్తపల్లి మాణిక్యాలరావు.. మృతిని కుటుంబాన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. అప్పారావు కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలని అధికారులను కోరారు.

➡️