వాషింగ్టన్ : అమెరికాలో మూడు వారాల క్రితం అదృశ్యమైన భారతీయ విద్యార్థి మంగళవారం శవమై కనిపించారు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం క్లీవ్ల్యాండ్ విశ్వవిద్యాలయంలో గత సంవత్సరం చేరాడు.క్లీవ్ల్యాండ్లో అతని మృతదేహం లభ్యమైనట్లు భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. అతను ఎలా చనిపోయాడో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. మార్చి 7వ తేదీ నుంచి విద్యార్థి ఫోన్ ఆఫ్లో ఉందని కుటుంబీకులు తెలిపారు. మార్చి 19న విద్యార్థిని కిడ్నాప్ అయినట్లు గుర్తు తెలియని నంబర్ నుంచి అతని తండ్రికి సమాచారం అందింది. విడుదల చేయడానికి 1,200 డాలర్ల డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా అమెరికాలో భారతీయ విద్యార్థులపై ఈ విధమైన ఘాతుకాలు పెరిగిపోతున్నాయి.