తిరుపతి సిటీ : తిరుమల మాదవం పిఎసి – 2 సెంటలో కిడ్నాప్ అయిన బాలుడు లభ్యమయ్యాడు. 3 గంటల వ్యవధిలోనే కిడ్నాప్ అయిన బాలుడిని పోలీసులు గుర్తించారు. ఆ బాలుడు తెలంగాణ రాష్ట్రం గద్వాల్ కి చెందిన అభినయ్ (3)గా తిరుమల పోలీసులు తెలిపారు. తమ కుమారుడిని ఎవరో ఎత్తుకుపోయారంటూ … పోలీసులకు తల్లితండ్రులు ఫిర్యాదు చేయడంతో వెంటనే సిసి పుటేజి ఆధారంగా బాలుడి ఆచూకి కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో బాలుడి కిడ్నాప్ వ్యవహారాన్ని లాడ్జి యజమాని గుర్తించారు. ఓ మహిళ పిల్లవాడుతోపాటు లాడ్జిలో బస చేసినట్లు లాడ్జ్ యజమాని పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు తక్షణమే పెద్దకాపు వీధిలోకి చేరుకొని బాలుడిని గుర్తించి తీసుకున్నారు. బాలుడిని వారి తల్లిదండ్రులకు ఎస్పీ కఅష్ణ కాంత్ పాటిల్ అప్పగించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ రాజానగరం రాజమండ్రి వాసి ఇజ్జాడ దేవిగా పోలీసులు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేపడుతున్నామని, దీని వెనుక ఎవరిదైనా హస్తం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నామని మీడియాతో తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ వివరించారు.