నాల్గో టెస్ట్‌కు బుమ్రాకు విశ్రాంతి

  • పటీధర్‌ స్థానంలో కెఎల్‌ రాహుల్‌

రాజ్‌కోట్‌: రాంచీ వేదికగా జరిగే నాల్గో టెస్ట్‌కు వైస్‌ కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా విశ్రాంతి తీసుకోనున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్లలో ముందంజలో ఉన్నాడు. అలాగే మూడోటెస్ట్‌లో నిరాశపరిచిన రజత్‌ పటీధర్‌ స్థానంలో గాయం నుంచి కోలుకున్న కెఎల్‌ రాహుల్‌ చోటు దక్కించుకోనున్నాడు. బిసిసిఐ అధికారి ఒకరు మూడో టెస్ట్‌ ముగిసిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించాడు. మంగళవారం బుమ్రా అహ్మదాబాద్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్లనున్నాడని ఆ అధికారి తెలిపాడు. బుమ్రాపై వర్క్‌లోడ్‌ను తగ్గించాలనే ఉద్దేశ్యంతో బిసిసిఐ ఆ నిర్ణయానికి వచ్చినట్లు, నాల్గోటెస్ట్‌ ముగిసిన తర్వాత మహ్మద్‌ సిరాజ్‌కు కూడా విశ్రాంతినిచ్చే అవకాశమున్నట్లు ఆయన తెలిపాడు. ఇక ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-1ఆధిక్యతలో ఉన్న సంగతి తెలిసిందే.

➡️