జర్నలిస్టుల హౌస్ సైట్స్ ఫైల్ ని చెత్త కుప్పలో వేసిందెవ్వరు..!? : కొల్లు రవీంద్ర

Mar 19,2024 18:01

మచిలీపట్నం : కలెక్టరేట్ లో భద్రంగా ఉండాల్సిన జర్నలిస్ట్ ల హౌస్ సైట్స్ ఫైల్ చెత్త కుప్పలో దొరకడంపై టిడిపి నేత కొల్లు రవీంద్ర స్పందించారు.  ఈ ఘటనపై మంగళవారం కలెక్టరేట్ లో సమాచార శాఖ డీడీని కలిసి ఆయన వివరణ కోరారు. మచిలీపట్నంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన  బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని డీడీని హెచ్చరించారు. అయితే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారని డీడీ తెలిపారని రవీంద్ర అన్నారు. డీడీ  పని తీరుపై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

➡️