జనసేనలో చేరుతున్నా: కొణతాల రామకృష్ణ

అనకాపల్లి: జనసేనలో చేరుతున్నట్లు సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రకటించారు. అనకాపల్లిలో నిర్వహించిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. పవన్‌ కల్యాణ్‌కు రాష్ట్ర అభివఅద్ధిపై స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. రాజీలేని పోరాటం చేసే వ్యక్తి ఆయనని.. రాష్ట్రంలో అరాచకపాలన అంతమొందించాల్సి ఉందని చెప్పారు.ఇటీవల జనసేన పవన్‌ కల్యాణ్‌తో హైదరాబాద్‌లో కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వారిద్దరూ ప్రత్యేకంగా సమాలోచనలు చేశారు. 2014లో వైసిపికు రాజీనామా చేసిన కొణతాల.. ఇంతవరకు ఏ పార్టీలోనూ అధికారికంగా చేరలేదు. తాజాగా జనసేనలో చేరికపై ఆయన స్పష్టత ఇచ్చారు.

➡️