- 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి క్రికెటర్గా రికార్డు
ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ 147ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు పడగొట్టిన తొలి పేస్ బౌలర్గా నిలిచారు. 187 టెస్టుల్లో అండర్సన్ ఈ మైలురాయిని అందకున్నాడు. కుల్దీప్ యాదవ్ వికెట్ తీయడంతో ఈ రికార్డు నమోదైంది. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అండర్సన్ మూడో స్థానంలో ఉన్నారు. అతని కంటే ముందు శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ (800), షేన్ వార్న్ (708), తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి అనిల్ కుంబ్లే 619 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.
ANDER700N ❤️ pic.twitter.com/jhbhuHYL4k
— England Cricket (@englandcricket) March 9, 2024