ప్రజాశక్తి – బాపట్ల
రైతులకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని పొందుపరుస్తూ వ్యవసాయ శాఖ రూపొందించిన డైరీని కలెక్టర్ పి రంజిత్ భాష సోమవారం ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం డైరీ, క్యాలెండర్ను స్పందన మందిరంలో జెసి చామకూరి శ్రీధర్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబ్దుల్ సత్తార్, రైతు శిక్షణ కేంద్రం డిడిఎ విజయనిర్మల, జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షులు కె ధనరాజు, కార్యదర్శి వెంకటకృష్ణ, కోశాధికారి లోకేశ్వరి పాల్గొన్నారు.