- జిల్లా విద్యాశాఖ అధికారి
ప్రజాశక్తి-వెదురుకుప్పం : చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు జాతీయ వైజ్ఞానిక దినోత్సవం పురస్కరించుకుని వెదురుకుప్పం హైస్కూల్ ని బుధవారం సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ పోటీతత్వంతో మేధా వికాసానికి దోహదం చేస్తుందని అప్పుడే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని పరిశోధనలతోనే వైజ్ఞానిక ప్రగతి మెరుగుపడుతుందని పరిశోధనలపై విద్యార్థులకు ఆసక్తి పెంచడం ఉపాధ్యాయుల కర్తవ్యం అని తెలియజేశారు. ఈ సందర్భంగా వెదురు కుప్పం హైస్కూల్ విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇన్స్పైర్ నందు రాష్ట్రస్థాయికి ఎంపిక అవడం ఇ ఎన్ డి పి నందు జిల్లా స్థాయిలో తృతీయ ఉత్తమ ప్రాజెక్టుగా కెంపు కావడంపై చాలా సంతోషంగా ఉందని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులుని మండల విద్యాశాఖ అధికారి మహేశ్వర సార్ ని అదేవిధంగా ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను అభినందించారు.