పార్శిల్ కార్యాలయాల్లో తనిఖీలు

ప్రజాశక్తి – పర్చూరు
స్థానిక పార్శిల్ కార్యాలయాల్లో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోదాలను ముమ్మరం చేశారు. స్థానిక రవి పార్శిల్, నవత పార్శిల్, క్రాంతి పార్శిల్ కార్యాలయాల్లో ఉన్న సీలు పెట్టెలను తెరచి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. పార్శిల్ వాహనాల్లో నగదు, మద్యం, ఇతర నిషేధిత వస్తువులు తరలించకుండ తనిఖీలు నిర్వహించినట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు. సరియైన పత్రాలు లేకుండ రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకొని వెళ్లరాదని తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️