హైదరాబాద్ : బంధన్ ఇన్నోవేషన్ ఫండ్ను ఆవిష్కరించినట్లు బంధన్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. ఈ కొత్త ఫండ్ ఆఫర్ ఏప్రిల్ 10న ప్రారంభమై 2024 ఏప్రిల్ 24న ముగియనుందని తెలిపింది. లైసెన్స్ పొందిన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు, పెట్టుబడి సలహాదారులు, ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు ద్వారా నేరుగా ఇందులో పెట్టుబడులు పెట్టొచ్చని బంధన్ ఎఎంసి సిఇఒ విశాల్ కపూర్ తెలిపారు. ఈ నిధులను అభివృద్థి పథంలో ఉన్న కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టనున్నామని పేర్కొన్నారు.