తెలంగాణ : బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినా సిఎం రేవంత్ రెడ్డి స్పందించలేదని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ధ్వజమెత్తారు. శనివారం ఎక్స్ వేదికగా కెటిఆర్ పోస్ట్ పెట్టి ఓ ఫోటోను షేర్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ రాలేదని అన్నారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినా సిఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదని, బిజెపికి వ్యతిరేకంగా సిఎం ఒక్క మాటా మాట్లాడడం లేదన్నారు. ”తెలంగాణ సిఎం ఎందుకు భయపడుతున్నారు ? రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు పణంగా పెడుతున్నారు ? కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు ” అని కెటిఆర్ పేర్కొన్నారు.