Indian Navy : 35మంది సముద్రపు దొంగలను పట్టుకున్న ఇండియన్ నేవీ

Mar 23,2024 10:40 #arest, #Indian Navy, #Mumbai, #pirates

ముంబై: సోమాలియా తీరంలో సముద్రపు దొంగలతో భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా ఈ ఉదయం ముంబై తీరం చేరింది. 35 మంది సముద్రపు దొంగలను ముంబై పోలీసులకు అప్పగించింది. అరేబియన్‌ సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ అడెన్‌లో వాణిజ్య నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు ఇండియన్‌ నేవీ ‘ఆపరేషన్‌ సంకల్ప్‌’ చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ నెల 15న అరేబియా సముద్రంలో పైరేట్ల నౌక ఎక్స్‌-ఎంవీ రూయెన్‌ను అడ్డగించిన భారత నౌక ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా 40 గంటల ఆపరేషన్‌ అనంతరం 35 మంది సముద్రపు దొంగలను బంధించింది. ఈ ఆపరేషన్‌లో ఐఎన్‌ఎస్‌ కోల్‌కతాకు సాయంగా ఐఎన్‌ఎస్‌ సుభద్ర, భారత వాయుసేన కూడా రంగంలోకి దిగి ఆపరేషన్‌ను పూర్తి చేశాయి. 35 మంది పైరేట్లతో అక్కడి నుంచి బయలుదేరిన నౌక ఈ ఉదయం ముంబై తీరం చేరుకుంది.

➡️