జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టులు ఆరంభం కానున్నాయి. టెస్ట్ సీరీస్ నేపథ్యంలో బీసీసీఐ జట్టును ప్రకటించింది. మొదటి రెండు టెస్టులకు పదహారు మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో కొత్త కుర్రాడు ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్కోటాలో స్థానం దక్కించుకున్నాడు.మొదటి రెండు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ఆవేశ్ ఖాన్.