తెలుగుదేశంలో చేరిక

ప్రజాశక్తి-కొమరోలు: కొమరోలు మండలంలో వైసీపీకి షాక్‌ తగిలింది. మండలంలోని నల్లగుంట్ల గ్రామా నికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు చెన్నారెడ్డి వెంకటేశ్వరరెడ్డి వైసిపికి గుడ్‌బై చెప్పారు. టిడిపి మండల అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు, టిడిపి గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో 50 కుటుంబాలతో సహా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి టిడిపి కండువాలు కప్పి వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనం తరం నల్లగుంట్ల ఎంపీటీసీ చెన్నారెడ్డి వెంకట ేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గిద్ద లూరు నియోజకవర్గంలో అశోక్‌రెడ్డి విజయం తధ్యమని, మండలంలో వారికి భారీ మెజార్టీ వచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. టిడిపి కొమరోలు మండల అధ్యక్షులు బోనేని వెంకటే శ్వర్లు మాట్లాడుతూ కొమరోలు మండలంలో టిడిపికి మంచి మెజార్టీ తీసుకువస్తామని చెప్పారు. చెన్నారెడ్డి వెంకటేశ్వరరెడ్డి చేరికతో పార్టీకి మరింత బలం చేకూరిందని భావిస్తున్నా నన్నారు. ఇదే తరహాలో కొమరోలు మండల ప్రజల మనసు కూడా గెలుచుకుని వారందరికీ టిడిపి సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించి టిడిపికి ఓటు వేసే విధంగా ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఎద్దుల సుబ్బా రెడ్డి, ఖాసీంపీరా, మందా అశోక్‌, బోయిళ్ల శిఖామణి, తక్కెల్ల సురేష్‌, సుధాకర్‌, గౌరీ దాస్‌, జామ్సన్‌, శేఖర్‌, వినరు తదితరులు పాల్గొన్నారు.

➡️