ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రారంభోత్సవాలు, చేరికలు 

Mar 4,2024 16:49 #East Godavari
Inaugural ceremonies and inductions under the auspices of MLA

ప్రజాశక్తి – ఉండ్రాజవరం: మండలం లోని వడ్లూరులో 26.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డా.వై.యస్.ఆర్.విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం, 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సి.సి రోడ్లు, స్మశానవాటిక వాల్ ను సోమవారం నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని టిడిపి, జనసేన పార్టీలకు చెందిన వడ్లూరు గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడు కిలాడి ఆంజనేయులు, తూము ధనరాజు, గంటా హనుమంతరావు, దాసరి లక్ష్మణరావు, గొర్రెల శ్యామ్ కుమార్, యు.వెంకటేష్, సిహెచ్ విజయ్ కుమార్, ఎల్. నవీన్, సిహెచ్ ప్రసాద్, ఏ.శ్రీను, తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వారిని కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన అనేకమంది వైకాపాలో చేరడం తో మరల రాష్ట్రంలో రానున్నది వైకాపా ప్రభుత్వమేనని అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రఘుమండ తేజశ్రీ, ఎంపిపి పాలాటి యల్లారీశ్వరి, జెసిఎస్ ఇంఛార్జి కటారి సిద్ధార్థ రాజు, రఘుమండ శ్రీను, గ్రామ వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు, ఎంపిటిసి, గ్రామ సొసైటి అధ్యక్షులు, సచివాలయం కన్వీనర్లు, వాలంటీర్ లు గృహ సారదులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మండల, గ్రామ వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️