వామపక్ష నాయకులను అక్రమంగా నిర్భంధించడం బాధాకరం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Nov 26,2023 19:02 #cpm v srinivasarao, #prakatana

అమరావతి: ప్రధాని తిరుపతి వచ్చిన సందర్భంగా సిపిఎం, సిపిఐ తదితర వామపక్ష పార్టీల నాయకులను అక్రమంగా నిర్బంధించడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండిరచారు. అరెస్టు అయిన వారిలో సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వి.నాగరాజు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కందారపు మురళి తదితరులు ఉన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు చేయకుండా కృష్ణా జలాలలో అన్యాయం చేసిన మోడీని ప్రశ్నించడానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం కోసం ప్రజల తరపున పోరాడుతున్న వారిని గృహనిర్బంధాలు చేసి నిరసనలను అణిచివేయటాన్ని శ్రీనివాసరావు గర్హిహించారు. మాట తప్పిన మోడీ తిరుపతిని అపవిత్రం చేశారన్నారు. ఇప్పటికైనా నిర్బంధ విధానానికి స్వస్తి చెప్పి రాష్ట్ర హక్కుల కోసం పోరాడేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

 

➡️