ప్రజాశక్తి – మెదరమెట్ల
సిఎం జగన్మోహన్రెడ్డి తనకు అద్దంకి నుండి పోటీ చేసే అవకాశం ఇస్తే గెలిచి గిఫ్టుగా ఇస్తానని వైసిపి ఇన్ఛార్జి పానెం హనిమిరెడ్డి అన్నారు. సిద్ధం మహాసభలో ఆయన మాట్లాడారు. సభ విజయవంతం అయిందని అన్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన వాహనాలు, ప్రజలు తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు 5గంటలకుపైనే పట్టే పరిస్థితి ఏర్పడింది. సభా స్థలం నుండి మేదరమెట్ల వరకు 7కిలోమీటర్లు ప్రజలు, బస్సులు నిలబడే ఉన్నాయి.