నూతన న్యాయమూర్తులకు సన్మానం

Jan 13,2024 00:41

ప్రజాశక్తి – చీరాల
నూతనంగా ఉద్యోగ బాధ్యత చేపట్టిన ఇద్దరు న్యాయమూర్తులకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. స్థానిక కోర్టు ఆవరణంలో జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ రెహానా హాజరైయ్యారు. పాలకొల్లు జూనియర్ సీవిల్ జడ్జిగా పి లక్ష్మి లావణ్య, తిరువూరు జూనియర్ సీనివల్ జడ్జిలుగా నియమితులైన ఎ సింధురను బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. నూతన న్యాయమూర్తులకు బార్ అసోసియేషన్ తరపున శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రసిడెంట్ గౌరవ రమేష్, వైస్ ప్రసిడెంట్ విజయలక్ష్మి, ట్రెజరరీ రామ కోటేశ్వరరావు, సీనియర్‌ న్యాయవాదులు టిజె సాయిబాబు, ఎంవి చలపతిరావు, రావుల రమేష్, ఎ సత్యనారాయణ, మణి, నాగసైన, ఎ కొండమ్మ, ఆర్ వెంకటేస్వారెడ్డి పాల్గొన్నారు.

➡️