- కర్ణాటకలోని గిరిజన పాఠశాలలో దారుణం
మైసూరు : 17 ఏళ్ల పదో తరగతి విద్యార్థిపై హిందీ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడిన దారుణం కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం బాధిత విద్యార్థి బిఆర్ హిల్స్లో గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఈ నెల 5 రాత్రి విద్యార్థి చదువుకుంటుండగా, తన ఇంటికి రావాలని హిందీ టీచర్ అరుణ్కుమార్ విద్యార్థికి మరో టీచర్ ద్వారా కబురు పంపాడు. దీంతో అరుణ్కుమార్ ఇంటికి విద్యార్థి వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న టీచర్ విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తరువాత రోజు అంటే ఈ నెల 6న పరీక్ష రాసిన అనంతరం ఈ విషయాన్ని విద్యార్థి వార్డెన్కు చెప్పడంతో ఆయన అధికారులకు సమాచారం అందించారు. దీంతో అరుణ్కుమార్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత విద్యార్థికి పరిహారం కింద రూ.లక్ష అందజేశారు.