అమరావతి : విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదానికి సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణను ఎపి హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. ఇటీవల గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించిన విషయం విదితమే. అయితే, తన రాజీనామా ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగలేదని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్, న్యాయశాఖ కార్యదర్శికి, సిఈసి కి, ఎస్ఈసి కి నోటీసులు జారీ చేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ … గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్కు లేఖ రాశారు. అప్పటి నుంచి ఈ అంశం పెండింగ్లో ఉండగా.. గత మంగళవారం స్పీకర్ ఆ లేఖను ఆమోదించారు.