ప్రజాశక్తి-సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్ట గ్రామం, ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్లో ఆదివారం గడప గడపకూ మన నాగార్జున కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మరియు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ మేరుగు నాగార్జునకు పేర్నమిట్ట గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తినేని విజయ భరత్రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. గత 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ రావూరి లింగారెడ్డి నాయకులు కత్తినేని శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.