ఘనంగా బ్రిలియంట్‌ కంప్యూటర్స్‌ వార్షికోత్సవం

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: బ్రిలియంట్‌ కంప్యూటర్స్‌ 29వ వార్షికోత్సవం స్థానిక అంజయ్య రోడ్డులోని ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్‌, చైర్మన్‌ డాక్టర్‌ న్యామతుల్లా బాషా, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తహురలు కేక్‌ కట్‌ చేసి సిబ్బంది, విద్యార్థులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలో డాక్టర్‌ న్యాయతుల్లా బాషా మాట్లాడుతూ సాంకేతిక విద్యతో అత్యంత ఉపయోగకరమైన కోర్సులను ప్రకాశం జిల్లాకు అందించడంలో సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ సందర్భంగా వందమంది పేద విద్యార్థులకు జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 10వ తేదీలోపు సంస్థ ప్రధాన కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ కో-ఆర్డినేటర్‌ కోటేశ్వరరావు, డైరెక్టర్‌ అఖిల్‌, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️