హీరో మహేష్బాబు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సంక్రాంతికి రాబోతున్న చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ‘కుర్చీ మడతపెట్టి’ అంటూ సాగే ఈ ప్రోమోలో మహేష్- శ్రీలీల డ్యాన్స్ చూడొచ్చుననీ, పూర్తి పూటను శనివారం విడుదల చేయబోతున్నామని చిత్రబృందం ప్రకటించింది.