సెల్‌ఫోన్‌తో పట్టుబడ్డ గ్రూప్‌-1 అభ్యర్థి

Mar 17,2024 20:13 #Copying, #Group-1 Prelims

ప్రజాశకి- ఒంగోలు కలెక్టరేట్‌ : గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షల్లో ఓ అభ్యర్థి సెల్‌ఫోన్‌తో పట్టుబడ్డాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్విస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం గ్రూప్‌-1 పరీక్ష రాసేందుకు ఏకంగా పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్‌తో వచ్చాడు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు తనికీ చేసినప్పటికీ వారి కళ్లుగప్పి సెల్‌ఫోన్‌ను పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లాడు. ఫోన్‌ ద్వారా కాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్‌కు పట్టుబడ్డాడు. అతడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ చేపట్టారు. అతడిపై అధికారులు కేసు నమోదు చేశారు.
లంచ్‌ బాక్సులు అనుమతించాలని అభ్యర్థుల ఆందోళన
క్విస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. లంచ్‌ బాక్సులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోవడంతో ఆందోళన చేశారు. సుదూర ప్రాంతాల నుంచి పరీక్షకు హాజరైతే తాము తినటానికి తెచ్చుకున్న ఆహార పదార్ధాలను లోపలికి అనుమతించకపోవడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం లంచ్‌ బాక్సులు ఒక గదిలో పెట్టుకోవటానికి అధికారులు అనుమతించటంతో ఆందోళన విరమించారు.

➡️