ఎఒ మీరయ్యకు ఘన సన్మానం

Feb 2,2024 22:47

ప్రజాశక్తి – భట్టిప్రోలు
ఉత్తమ వ్యవసాయ అధికారిగా అవార్డును అందుకున్న గొల్లపోతు మీరయ్యను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ డివి లలిత కుమారి, జెడ్పిటిసి టి ఉదయ్ భాస్కరి చేతుల మీదుగా శుక్రవారం ఘనంగా సన్మానించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం స్కరించుకొని కలెక్టర్ రంజిత్ భాషా చేతుల మీదుగా వీరయ్య అవార్డు అందుకున్నారు. మండల స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనను దుశ్యాలవతో సత్కరించారు. కార్యక్రమంలో కార్యాలయ ఎఒ జలజ, ఎపిఎం శ్రీమన్నారాయణ, ఐకెపి సీసీలు రజని, హానోక్, సాంబయ్య, నాయకులు మల్లేశ్వరరావు, బాలాజీ పాల్గొన్నారు.

➡️