చిల్లకూరులో భారిగా పట్టుబడ్డ బంగారం, వెండి

Apr 23,2024 11:55 #2024 election, #Gold, #gold sized, #Tirupati

ప్రజాశక్తి-తిరుపతి : అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే.. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బుధనం దగ్గర పోలీసులు తనిఖీలు చేయగా.. కారులో భారీగా బంగారం, వెండి పట్టుబడ్డాయి. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదు తరలిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పట్టుబడ్డ సోత్తు విలువ సువారు 9 కోట్లు విలువ చేస్తునందిన పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️