కదులుతున్న బస్సులో.. బాలికపై సామూహిక అత్యాచారం

Dec 18,2023 10:33 #Gang Rape, #Rajasthan
Rajastha 8-year-old schoolgirl gang-raped by driver, his f

కాన్పూర్‌ నుంచి జైపూర్‌కు వెళ్తున్న సమయంలో డ్రైవర్ల ఘాతుకం

ఢిల్లీ ‘నిర్భయ’ తరహా ఘటనన్యూఢిల్లీ : దాదాపు 11 ఏళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ సామూహిక లైంగికదాడి ఘటనను పోలి ఉండే మరొక ఘటన చోటు చేసుకున్నది. కాన్పూర్‌ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్తున్న బస్సులో ఒక బాలికపై ఇద్దరు డ్రైవర్లు దారుణానికి ఒడిగట్టారు. ఘటనను గుర్తించిన తోటి ప్రయాణికులు డ్రైవర్లకు దేహశుద్ధి చేశారు. ఒక డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేయగా.. మరొక డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపన కథనం ప్రకారం.. ఈ ఘటన ఈనెల 9వ తేదీ రాత్రి 7:30 గంటల సమయంలో ఒక అమ్మాయి కాన్పూర్‌ నుంచి జైపూర్‌కి తన మామ ఇంటికి వెళ్తున్నది. బస్సు ఎక్కిన ఆమెకు కూర్చోవటానికి సీటు దొరకలేదు. దీంతో డ్రైవర్లు ఆమెను క్యాబిన్‌లో కూర్చోబెట్టారు. బస్సు బయలుదేరాక ప్రయాణ సమయంలో ఆ ఇద్దరు డ్రైవర్లు ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. బస్సులో ఉన్న ప్రయాణికులు క్యాబిన్‌ డోర్‌ తెరిచి, బాలిక దీనస్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు డ్రైవర్లను చికతబాదారు. డ్రైవర్లలో ఒకరు తప్పించుకుపోగా.. మరొకరిని పోలీసులకు ప్రయాణికులు అప్పగించారు. బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. 2012లో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురి చేసిన ఢిల్లీ సామూహిక లైంగికదాడి ఘటనకు, ప్రస్తుత ఘటనకు దగ్గరి పోలికలు ఉన్నాయి.

➡️