వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన

Feb 25,2024 15:10 #East Godavari, #water tanker

ప్రజాశక్తి- గోకవరం(తూర్పు-గోదావరి) : మండల కేంద్రమైన గోకవరం ఊరకాలువ గట్టుపై 1వ సచివాలయం పరిధిలో27లక్షలరూపాయలతో 40వేల లీటర్ల సామర్థ్యం గల జలజీవన్ మిషన్ నిధులుతో మంచినీటి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ కొమరం శ్రావణ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోకవరం సొసైటీ అధ్యక్షులు దాసరి చినబాబు, గోకవరం మండల సచివాలయల కన్వీనర్ దాసర రమేష్, వైసీపీ నాయకులు సుంకర వీరబాబు, సుంకర రమణ, దాసరి సతీష్ లు పాల్గొని వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పులపర్తి బుజ్జి, చింతల అనిల్, మెహర్ బాబా, తోలేటి రాంప్రసాద్, దాసరి చిన సతీష్, బదిరెడ్డి రాంబాబు, సురేష్, ఆర్డబ్ల్యూఎస్ జె ఈ హరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️