చంఢీగఢ్ : మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ బిజెపికి గుడ్బై చెప్పారు. త్వరలో కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. ఆయన కుమారుడు బ్రిజేందర్ సింగ్ గత నెల కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. బీరేందర్సింగ్ భార్య, హర్యానా హర్యానా మాజీ బిజెపి ఎమ్మెల్యే ప్రేమ్ లతా కూడా బిజెపిని వీడనున్నట్లు తెలుస్తోంది.
సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని అన్నారు. తన రాజీనామాను పార్టీ చీఫ్ జె.పి. నడ్డాకు పంపానని చెప్పారు. 2014-2019 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన తన భార్య ప్రేమ్లత కూడా పార్టీని వీడినట్లు తెలిపారు. రేపు కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రకటించారు.
పదేళ్ల క్రితం బీరేందర్ సింగ్ కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరారు.