సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్‌ మార్చ్‌… గ్రామసభలు

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఆత్మకూరు మండలంలోని శుక్రవారం సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్‌ మార్చ్‌ గ్రామసభలను నిర్వహించారు. జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఐపిఎస్‌ ఆదేశాల మేరకు ఆత్మకూరు మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన గొరిదిండ్ల, ముట్టాలలో పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌, గ్రామసభలు నిర్వహించారు. ఆత్మకూరు ఎస్సై మునీర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలోని ప్రధాన రహదారులలో, ముఖ్యమైన కాలనీల గుండా ఫ్లాగ్‌ మార్చ్‌ కొనసాగింది. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు సంకల్పించారు. ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతవరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ప్రజల్లో భరోసా కల్పించారు. అనంతరం కేంద్ర సాయుధ పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు.

➡️