ప్రజాశక్తి – వీరఘట్టం : పాలకొండ నియోజకవర్గ జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు మద్దతుగా జనసేన స్టార్ క్యాంప్నర్, సినీనటుడు పృధ్వీరాజ్ శుక్రవారం వీరఘట్టం మండల కేంద్రంలో ప్రచారం చేశారు. స్వామి థియేటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు పాదయాత్ర చేస్తూ ప్రజకు అభివాదం చేస్తూ అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జనసేన అభ్యర్థి నిమ్మక జయకష్ణకు గాజుగ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి బిపినాయుడు, నాయకులు ఎం.పుండరీకం, జనసేన జానీ, టిడిపి నాయకులు పొదిలాపు కృష్ణమూర్తి నాయుడు, తెలుగు యువత మాచర్ల అనిల్, పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.పాలకొండ :ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిదే విజయమని, పాలకొండలో జనసేన అభ్యర్థి జయకష్ణ అఖండ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడరని సినీనటుడు పథ్విరాజ్ అన్నారు. శుక్రవారం పాలకొండలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కూటమిదే విజయమని, జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదని, పాలకొండ నియోజకవర్గంలో రోడ్డులు పరమ అధ్వాహ్నంగా ఉన్నాయని విమర్శించారు. ఇంతటి దుర్మార్గపు పాలన ఎక్కడా లేదని, ఈ ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని అన్నారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకష్ణ మాట్లాడుతూ కూటమి విజయం ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.సీతంపేట : మండలంలోని దేవానపురం ,వేంపలగూడ,రేగుల గూడ,పాత ఈతమను గూడ,కొత్త గూడ,ఇప్పగూడ,ముకుందాపురం, కల్లం గూడ,అనపకాయలు గూడ, పులిపుట్టి గ్రామాల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటు అనే ఆయుధంతో గాజు గ్లాస్ పై ఓటు వేసి అభివద్ధికి నాంది పలుకుతారని ఈ సందర్భంగా ప్రజానీకానికి అభ్యర్థించారు. కార్యక్రమంలో సీతంపేట మండల పార్టీ అధ్యక్షులు సవర తోట మొఖలింగం,స్థానిక నాయుకులు ఉమ్మడి పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.