ప్రజాశక్తి-పార్వతీపురం : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నెలకు 26వేల రూపాయిల జీతం ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్ల పార్వతీపురంలో నిరసన చేపట్టారు. సోమవారం ఉదయం జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మండల స్థాయిలో బదిలీలు నిర్వహించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను సచివాలయలకు అనుసంధానం చేయాలని, తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న బకాయిలను చెల్లించాలని కోరారు.