పండగలు, ర్యాలీలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

Apr 21,2024 11:02 #cp srinivasreddy, #press meet

హైదరాబాద్‌: పండగలు, ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. త్వరలో రానున్న హనుమాన్‌ జయంతి ర్యాలీ సందర్భంగా బజరంగదళ్‌, విశ్వహిందూ పరిషత్‌ సభ్యులతో పాటు ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ర్యాలీలో డీజే, ఫైర్‌ క్రాకర్‌లు పేల్చడం, బాటసారులపై రంగులు చల్లడం, కర్రలు, కత్తులు, ఆయుధాలు తీసుకెళ్లడం, రెచ్చగొట్టే ప్రసంగాలు, పాటలు, బ్యానర్‌లు ప్రదర్శించడంపై నిషేధం ఉందన్నారు.
పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్‌లను వినియోగించకూడదన్నారు. ర్యాలీ ప్రశాంతంగా జరిగేలా అందరూకలిసి సహకరించుకోవాలన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ర్యాలీ నిర్వాహకులు మోడల్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించకూడదన్నారు.

➡️