కేప్టౌన్ : జనవరి 3 నుంచి కేప్టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్కు దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ టెంబా బావుమా దూరం కాగా ఇప్పుడు ఫాస్ట్బౌలర్ గెరాల్డ్ కోయిట్జీ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించింది. కోయిట్జీ ప్రస్తుతం కటి వాపుతో బాధపడుతున్నాడని.. ఈ క్రమంలో కేప్టౌన్ వేదికగా భారత్తో జరిగే రెండు టెస్టుకు దూరమయ్యాడని సౌతాఫ్రికా క్రికెట్ ఎక్స్(ట్విటర్)లో పేర్కొంది. రెండో టెస్టుకు అతడి స్ధానంలో వియాన్ ముల్డర్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.