పదోతరగతి విద్యార్ధులకు వీడ్కోలు

Mar 6,2024 01:00

ప్రజాశక్తి – అద్దంకి
మండలంలోని చక్రాయపాలెం జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు పలికారు. విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్షలకు ఎలా సిద్ధం కావాలనే విషయాలను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు వివరించారు. హెచ్‌ఎం కెవి శ్రీనివాసరావు అధ్యకతన జరిగిన సభలో ఎంఈఓ బూదాటి సుధాకరరావు మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా నేర్చుకున్న విషయాలను బాగా జ్ఞాపకం ఉండేలా రివిజన్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీసీ చైర్మన్ గోగులమూడి పార్వతి, చక్రాయపాలెం పూర్వ హెచ్‌ఎం సన్నమూరి మారుతి, తిమ్మాయ్యపాలెం హెచ్‌ఎం పెంట్యాల గంగాధరరావు, ఎస్‌జె శ్రీనివాసరావు, ధర్మవరం జెడ్‌పి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వూటుకూరి శ్రీనివాసులు, గోరకాయపాలెం హెచ్‌ఎం లక్కరాజు సుజాత, వేంపరాల ఎంపియుపిఎస్ హెచ్‌ఎం సాంబశివరావు, గోపాలాపురం ఎంపిపిఎస్ హెచ్‌ఎం బివి రత్నం, సింగరకొండపాలెం ఎంపీపీ ఎస్ సమాధాన కుమార్, పురుషోత్తం పాల్గొన్నారు.

➡️