- క్షణాల్లో టికెట్లు సోల్డ్ అవుట్
హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. సన్రైజర్స్ హైదరాబాద్తో ఈ నెల 25న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, మే 2న రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్లో జరిగే ఈ మ్యాచ్లకు టికెట్లను నిర్వాహకులు పేటీఎంలో విక్రయానికి పెట్టారు. అందుబాటులోకి తీసుకొచ్చిన క్షణాల్లో సోల్డ్ అవుట్ అని చూపించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సన్రైజర్స్ యాజమాన్యం పేటీఎంలో ఎన్ని టికెట్లు విక్రయానికి పెడుతోందో చెప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు.