ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రూప్ 2 పరీక్షకు మంగళగిరిలోని మూడు పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు హాజరవుతున్నారు. నిర్మల జూనియర్ కళాశాల సెంటర్లో 350 మంది, సీకే జూనియర్ కళాశాలలో 250 మంది, వీటిజే ఎం అండ్ ఐ వి టి ఆర్ డిగ్రీ కళాశాలలో 350 మంది చొప్పున కేటాయించారు. పట్టణ సిఐ ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐ శ్రీనివాసరావు దగ్గరుండి హాల్ టికెట్లను పరిశీలించి పరీక్షా కేంద్రానికి పంపుతున్నారు.