పులివెందుల చేరిన ఎంపీ అభ్యర్థుల ఇవిఎంలు

ప్రజాశక్తి – పులివెందుల టౌన్‌పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన లోక్‌సభ అభ్యర్థుల ఇవిఎంలు సోమవారం రాత్రి పులివెందుల పట్టణానికి చేరాయి. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జెఎన్‌టియు కళాశాలలో భద్రపరిచారు. రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, వివిధ పార్టీల రాజకీయ నాయకుల సమక్షంలో ఇవిఎంలను స్ట్రాంగ్‌ రూంలో ఉంటారు. అందరి సమక్షంలో సీల్‌ వేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించిన లోక్‌సభ అభ్యర్థుల ఇవిఎంలు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఇవిఎం మిషన్లు 361, ఇవి ప్యాడ్లు 391 వచ్చాయన్నారు. మరో రెండు రోజుల్లో పులివెందుల అసెంబ్లీకి సంబంధించిన ఇవిఎంలు, ఇవి ప్యాడ్‌లు వస్తాయన్నారు. వాటిని కూడా అందరి సమక్షంలో భద్రపరుస్తామని పేర్కొన్నారు. మరో 10 రోజుల్లో ఇవిఎంలను అందరి సమక్షంలో పరీక్షిస్తామన్నారు. కార్యక్రమంలో పులి వెందుల తహశీల్దార్‌ రమేష్‌బాబు, ఎస్‌ఐ అరుణ్‌ రెడ్డి , వివిధ పార్టీల నాయకులు, రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️