నిరాహార దీక్ష విరమణ

Apr 5,2024 14:23 #Prakasam District

ప్రజాశక్తి-పొదిలి : పొదిలి ఆర్టీసీ డిపోలో కార్మికుల సమస్యలపై రీజినల్ మేనేజర్  స్పందించారు. ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్ చార్టుల ఏర్పాటు కోసం హామీ ఇచ్చారు. ఈ నెలాఖరులోగా విధులకు సంబంధించి చాటలు వేస్తామని, వివాదాస్పద మహిళా అధికారిని తాత్కాలిక విధుల నుంచి తప్పిస్తున్నామని ఇతర సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో తాము నిరహార దీక్ష నుంచి విరమిస్తున్నట్లు ఉద్యోగులు కార్మికులు తెలిపారు. శాఖ పరమైన సమస్యలు కూడా సత్వరం పరిష్కరించేదుకు తాము చొరవ చూపుతామని హామీ ఇవ్వడంతో కార్మికులు నిరాహార దీక్ష విరమించారు.

➡️