వ్యవసాయ కూలీకి రూ.1,22,206 కరెంటు బిల్లు ..!

ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : వ్యవసాయ కూలీకి రూ.1,22,206 కరెంటు బిల్లు వచ్చింది.. దీంతో ఆ కూలి ఖంగుతిన్నారు.. ఏంటిది ? ఒక కరెంటు బల్బు, ఒక ఫ్యాను మాత్రమే వాడుతుంటే ఇంత బిల్లా ? అని అవాక్కయ్యాడు..!

ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీ చినరావుపల్లి గ్రామానికి చెందిన పప్పల ముకుందరావు అనే వ్యవసాయ కూలీకి మార్చి నెల కరెంటు బిల్లు ఏకంగా రూ.1,22,206 బిల్లు వచ్చింది. ఈ విషయమై కూలీని అడగగా.. ‘గ్రామంలో విద్యుత్తు సిబ్బంది రెండు రోజుల క్రితం మీటరు రీడింగ్‌ తీసి ఇచ్చారని.. బిల్లు కట్టేందుకు ఎంతని చూస్తే లక్షల్లో బిల్లు ఉందని’ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక విద్యుత్‌ బల్బు, ఒక ఫ్యాను మాత్రమే వాడుతుంటామని ఇంత బిల్లు ఎలా వచ్చిందని లబోదిబోమంటున్నాడు. సమస్యను విద్యుత్తు శాఖో ఏఈ కూన హరికఅష్ణ వద్ద మీడియా ప్రస్తావించగా ముద్రణలో సాంకేతిక సమస్యల వల్ల తప్పుగా బిల్లు వచ్చిందని చెప్పారు.

➡️