విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

Dec 14,2023 00:30

ప్రజాశక్తి – చీరాల
నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కరణం బలమ కృష్ణమూర్తి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయితీ రాజ్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నాడు – నేడు కింద, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, అభివృద్ధి పనులపై చర్చించారు. విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, పంచాయితీ రాజ్ ఈఈ కృష్ణ, మునిసిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డి, డిఈ ఐసయ్య, పంచాయితీ రాజ్ డిఈ శేషయ్య, ఎంపిడిఓ కె నేతాజీ, విద్యుత్ డిఈఈలు టి శ్రీనివాసరావు, జె శ్రీనివాసులు, ఎఈలు శ్యామ్ సుందర్, కె అరుణ, బ్రహ్మం, భాస్కర్ పాల్గొన్నారు.

➡️