నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి 

Apr 10,2024 14:29 #West Godavari District

 ఆచంటలో శిక్షణా తరగతుల్లో మాట్లాడుతున్న రిటర్నింగ్ అధికారి వి స్వామి నాయుడు.
ప్రజాశక్తి-ఆచంట( పశ్చిమగోదావరి జిల్లా) :  ఎన్నికలలో పాల్గొనే అధికారులు సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆచంట రిటర్నింగ్ అధికారి వి స్వామి నాయుడు అన్నారు. నియోజకవర్గస్థాయిలో   ఎన్నికల విధులు నిర్వహించే పీవో ఏపీవో లకు బుధవారం స్థానిక ఎం వి ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎటువంటి రాజకీయ ఒత్తులకు గురికాకుండా వివాదారహితంగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.  ఈ శిక్షణ కార్యక్రమానికి 220 మంది తరగతుల్లో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి  ఐపీ శెట్టి,  ఎంపీడీవో పి నరసింహ ప్రసాద్, పెనుమంట్ర తాసిల్దార్ లక్ష్మీ కళ్యాణి, డిప్యూటీ తాసిల్దారు లు రాంప్రసాద్ రాజు, సుగుణ సంధ్య, ఆర్ ఐ జయలలిత, నాగిరెడ్డి, జి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

➡️