హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండిఎను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. లావణ్య టాలీవుడ్ హీరో ప్రియురాలిగా తెలిసింది. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని నగరంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆమెపై ఎన్డిపిఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇప్పటికే మోకిలా పీఎస్ డ్రగ్స్ కేసులో లావణ్య నిందితురాలిగా గుర్తించారు. సినీ ఇండిస్టీలో అనేక మందితో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకున్న లింకులపై కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.