ప్రజాశక్తి-మద్దికేర : మద్దికేర మండల పరిధిలోని ఎడవల్లి ఎస్సీ కాలనీలో సైడ్ కాలువలు వేసిన ఉపయోగం లేదని కాలనీవాసులు ఆరోపించారు.. సీసీ రోడ్డు మీద పడిన వర్షపు నీరు ఇళ్లలో ఉన్న ఆపరిశుభ్రమైన, మురుగునీరు సైడ్ కాలువల ద్వారా ముందుకు పోవడం లేదన్నారు. సైడ్ కాలవల్లో మురుగునీరు నిలువ కావడం వల్ల కాలనీ వాసులకు పిల్లలకు మలేరియా డెంగు విష జ్వరాలు వస్తున్నాయని తెలియజేశారు. గతంలో స్పందన కార్యక్రమంలో సైడు కాలువల ద్వారా నీరు పోయేలా చేయండని సంబంధిత అధికారులకు అర్జీలు కూడా ఇచ్చామని ఇంతవరకు ఏ అధికారులు సమస్యను పరిష్కరించలేదని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాలు చెబుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగన్న పకీరప్ప రాముడు సురేషు హనుమేషు రంగన్నలు పాల్గొన్నారు.