ప్రజాశక్తి – ఉంగుటూరు
నారాయణపురంలోని శ్రీఅరవింద శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి దరఖాస్తు చేసుకున్న సందర్భంగా వేగేశ్న సత్యనారాయణ రాజు, ఆయన కుమారుడు సతీష్ రాజు రూ.1.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. విరాళాన్ని నారాయణపురంలోని సమత గేమ్స్ అండ్ స్పోర్ట్స్ క్లబ్లో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిరెడ్డికి దాత సత్యనారాయణ రాజు అందజేశారు.