విధులు బహిష్కరించిన పారిశుధ్య కార్మికులు

Feb 28,2024 12:31 #palnadu district
Discharged Sanitation Workers

విధులలో మృతి చెందిన పారిశుధ్య కుటుంబానికి  న్యాయం చేయాలంటూ ఆందోళన

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : కొద్ది రోజుల క్రితం విధులలో ఉండగా మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్ ప్రమాదవశాత్తు ఢీకొని మృతి చెందిన డేరంగి కోటయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ పారిశుద్ధ్య (సిఐటియు, ఏఐటియుసి) కార్మికులు విధులు బహిష్కరించి స్థానిక పురపాలక సంఘం కార్యాలయ ప్రాంగణంలో బైఠాయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి అమరారపు సాల్మన్ మాట్లాడుతూ చికిత్స పొందుతూ మృతి చెందిన డేరంగి కోటయ్య కుటుంబానికి రూ 20 లక్షల ఆర్థిక సహాయం పారిశుధ్య విభాగంలో పర్మినెంట్ ఉద్యోగం నివేశన స్థలం మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిలార్ మసూద్ మాట్లాడుతూ కార్మిక సంఘాలు ఎన్ని ఉన్నా హక్కులు సాధన కోసం ఒక్కటిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.విధులలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా మున్సిపల్ కమిషనర్  ఎం.రాంమోహనరావు సాధారణ బదిలీలలో మంగళవారం బదిలీ అయ్యారు. బుధవారం కొత్త కమిషనర్ విధులలోకి రానున్న నేపథ్యంలో కొత్త కమిషనర్ వచ్చి మృతి చెందిన కార్మికుని కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామన్నారు.

➡️