శిథిలావస్థకు చేరిన పురాతన ఈఒ ఆర్‌డి కార్యాలయం

Jan 10,2024 11:36 #damaged, #EO RD office, #old

చింతలపూడి (ఏలూరు) : చింతలపూడి మండలం ఈఒ ఆర్‌డి కార్యాలయం శిథిలావస్థకు చేరింది. 1975 సంవత్సరంలో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనం నేడు స్లాబ్‌ పై నుంచి పెచ్చులు కిందపడుతూ ప్రమాదకరంగా మారాయి. అనేక పనుల నిమిత్తం, కార్యాలయం వద్దకు, పంచాయతి కార్యదర్శిలను కలవడానికి కార్యాలయం వద్దకు జనం చేరుకుంటారు. ఎప్పుడు భవనం కూలుతుందోనని జనం భయపడుతున్నారు. ఉన్నత అధికారులు, స్పందించి భవనానికి మరమ్మతులు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

➡️