అభివృద్ధి చేస్తా : వైసీపీ అభ్యర్థి వెంకటేష్

Mar 20,2024 23:57

ప్రజాశక్తి – చీరాల
సమస్యల పరిష్కారానికి కృషి చేసి అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తానని వైసీపీ ఎంఎల్‌ఎ అభ్యర్థి కరణం వెంకటేష్ అన్నారు. మండలంలోని దేవినూతల పంచాయతీలోని అంకమ్మ గుడిలో పూజల అనంతరం తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పధకాలు అందించిందని అన్నారు. గ్రామంలో పర్యటించారు. కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, వైసిపి మండల అధ్యక్షులు ఆసాది అంకళరెడ్డి, వేటపాలెం అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు, చీరాల పట్టణ అధ్యక్షులు కొండ్రు బాబ్జీ, మున్సిపల్‌ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లీ వైష్టవి, మల్లెల లలిత రాజశేఖర్, యువజన రాష్ట్ర అధ్యక్షుడు యాతం మేరిబాబు, సేవదళ్ రాష్ట్ర సెక్రటరీ గోలి గంగాధర్, వ్యవసాయ సలహా మండలి జిల్లా సభ్యులు పులి వెంకటేశ్వర్లు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు చీమకుర్తి బాల కృష్ణ, వైసిపి జిల్లా కార్యదర్శి బండారు శివపార్వతి, సల్లూరి అనిల్, ఆర్బీకె చైర్మన్లు కావూరి రమణరెడ్డి, పల్లపోలు శ్రీనివాసరావు, జేసీఎస్ ఇంచార్జీ బుర్ల సాంబశివరావు పాల్గొన్నారు.

➡️